నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - జనవరి 11 : జనవరి 18వ తేదీ ఖమ్మం నగరం నందు సిపిఐ శతాబ్ది ఉత్సవాల కరపత్రాలు విడుదల చేశారు ఈసందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 2026 జనవరి 18 న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగసభ జరుగుతున్నదని పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు* *1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) భారత గడ్డపై వందేళ్ళు పూర్తి చేసుకుంటున్నదాని. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ (సిపిఐ) శత వసంత ఉత్సవాలు పార్టీ ఆవర్భవించిన కాన్పూర్ 2024 డిసెంబర్ 26న ప్రారంభమై దేశ వ్యాపితంగా ఉత్సవాలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయనీ. బ్రిటీష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారు, కాన్పూర్, మీరట్, పెషావర్ తదితర కుట్ర కేసులు పెట్టి నాయకులను జైళ్ళలో నిర్భందించారు. అయినప్పటికీ కార్మిక, విద్యార్ధి, యువజన, రైతు, మహిళా తదితర ప్రజా సంఘాలను నిర్మించి వెట్టిచాకిరి విముక్తి కొరకు, కార్మికులు, కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు సి.పి.ఐ. నిర్వహించింది. ఈ శతాబ్దకాలంలో ఎన్నో పోరాటాలు, ఎనెన్నో త్యాగాలు ఎంతో మంది అమరవీరుల రక్త తర్పరణతో ఎన్నెన్నో విజయాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో సి.పి.ఐ. తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది* భూమికోసం, భుక్తికోసం నిరంకుశ నిజాంను గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేలమంది ప్రాణ త్యాగాలతో, మూడువేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాలభూమిని పంచిన చరిత్ర భారత కమ్యునిస్టుపార్టీది. పున్నప్రవాయిలర్, తెభాగ లాంటి వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యునిస్టు పార్టీది. ఫలితంగానే పాలకులు భూసంస్కరణ చట్టం, గరీభీహఠావో, బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలను చేయాల్సివచ్చింది. పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది కమ్యూనిస్టుపార్టీ అని తెలిపారు ఈకార్యక్రమ సిపిఐ మండల కార్యదర్శి కే అంజనప్ప సహాయ కార్యదర్శి ఎస్ నిజాముద్దీన్ చంద్ర లక్ష్మన్న చౌడప్ప శంకరమ్మ రమణమ్మ రామప్ప ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News