నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 30 : తంబళ్లపల్లె మండలంలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 22 గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాల ద్వారా ఈనెల 19వ తేదీ నుండి 30 వరకు 4612 పశువులకు వైద్యం అందించామని మండల పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్ ఎన్ తాండ, జుంజుర పెంట పంచాయతీలలో పశువులకు బ్యూటీ టాక్స్ పిచికారి, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణకు ముందు తాపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు సీజనల్ వ్యాధుల నివారణకు టీకాలు వేయించుకోవాలని అదేవిధంగా పశు బీమా పథకం కింద పాడి రైతులు రూ300 చెల్లించి రూ మూడేళ్ల కాలానికి 30వేలు బీమా పొందవచ్చని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ డాక్టర్ ఇందు, సహాయకులు భాస్కర్ రెడ్డి, సాదిక్ భాషా, శివా నాయక్, బాబ్జాన్, నాయక్, ప్రవీణ్, రమేష్ రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News