Thursday, 16 April 2026 03:21:32 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

నేరస్థులకు శిక్షే లక్ష్యం గా సాక్షులను సకాలంలో హాజరుపరచాలి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ

Date : 24 March 2026 07:52 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 24 : బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చడంలో కోర్టు కానిస్టేబుళ్లు వారధిలా పనిచేయాలని, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడటమే ప్రథమ కర్తవ్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారు స్పష్టం చేశారు. మంగళవారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో డీసీఆర్బీ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ సిబ్బందితో ఎస్పీ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి కేసుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా హత్యలు, మహిళలు మరియు చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు (పోక్సో), మత్తు పదార్థాల రవాణా (ఎన్.డి.పి.ఎస్) వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. "నిందితుడికి శిక్ష పడినప్పుడే బాధితుడికి నిజమైన న్యాయం జరిగినట్లు" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ సమయంలో సాక్షులు భయం లేకుండా వాంగ్మూలం ఇచ్చేలా వారికి రక్షణ కల్పించి, విచారణ సమయానికి వారిని తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాలని ఎస్పీ ఆదేశించారు. న్యాయస్థానాలు జారీ చేసే సమన్లు, బెయిలబుల్ మరియు నాన్-బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న వారెంట్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. దేశంలో నూతనంగా అమల్లోకి వచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాల పట్ల ప్రతి కానిస్టేబుల్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కొత్త నిబంధనల ప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని సూచించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన అనంతరం సంబంధిత కేసులలో సీసీ నంబర్లను తీసుకునేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, కేసు వివరాలను విధిగా సీసీటీఎన్ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కోర్టు కానిస్టేబుళ్లు తమ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం వృత్తిపరమైన సత్సంబంధాలు కొనసాగిస్తూ, కేసుల పురోగతిని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ కె. దస్తగిరి, పలువురు ఎస్ఐ లు, కోర్టు లైజనింగ్ అధికారులు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :