నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - ఫిబ్రవరి 28 : శనివారం ఉదయం సదుం మండలం గొంగివారిపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగుల పెన్షన్ ను లబ్ధిదారుడైన ఎస్.రమేష్ ఆయన ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్ చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా ఉందా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నది తదితర విషయాలని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజ్ కాలవలో కలవకుండా లీకేజ్ లేకుండా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించే విధంగా చూడాలని ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ ఎంపీడీవో నాగరాజు, సోమల మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News