Monday, 02 March 2026 06:50:50 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 28 February 2026 08:59 PM Views : 39

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - ఫిబ్రవరి 28 : శనివారం ఉదయం సదుం మండలం గొంగివారిపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగుల పెన్షన్ ను లబ్ధిదారుడైన ఎస్.రమేష్ ఆయన ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్ చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా ఉందా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నది తదితర విషయాలని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజ్ కాలవలో కలవకుండా లీకేజ్ లేకుండా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించే విధంగా చూడాలని ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ ఎంపీడీవో నాగరాజు, సోమల మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :