నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 24 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రైతుల వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల తోబాటు పంచాయతీ తాగునీటి బోర్ల కేబుల్ వైర్లు సైతం చోరీ చేశారు. గోపి దీన్నే పంచాయతీలోని కే.బితాండ నుండి గుండ్లపల్లి పంచాయతీ తోబాటు మొలకలచెరువు మండలం దేవలచెరువు ప్రాంతంలో సైతం పలుచోట్ల ఈ దుండగులు కేబుల్ వైర్లు చోరీకి పాల్పడ్డారు. ఈ కేబుల వైర్ల చోరీ విషయమై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ వైర్ల చోరీ పై గుండ్లపల్లి సర్పంచ్ మౌలాలి తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ తో పాటు మండల పరిషత్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.
Reporter
Namitha News