నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జూన్ 16 : వాహనదారులుతమ వాహనాలకు జరిమానాలు, కేసుల బారిన పడకుండా వాహనదారులకు ఆత్మకూరు సిఐ గంగాధర్ ముందస్తు సూచనలు చేశారు... కార్డన్ సెర్చ్లు, ప్రత్యేక వాహన తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం లేదా జరిమానాలు విధించే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ గంగాధర్ సూచించారు. ప్రతి వాహనానికి ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు సక్రమంగా ఉంచుకుంటే జరిమానాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు లేదా కేసులు ఉంటాయని అందువల్ల జరిమానాల బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు
Reporter
Namitha News