Thursday, 16 April 2026 03:05:10 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు

ఇంచార్జ్డి జాయింట్ కలెక్టర్, డి .ఆర్.ఓ. మధుసూదన్ రావ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 18 March 2026 02:52 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన ఐదేళ్ల పదవీకాలం 2021 మార్చి 18 నుండి 2026 మార్చి 17 సాయంకాలం వరకు కొనసాగి, నిర్ణీత గడువు నాటికి పూర్తయినది.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన దృష్ట్యా, పరిపాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో పరిపాలన బాధ్యతలను తాత్కాలికంగా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహించనున్నది. ఈ క్రమంలో మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు నియమితులయ్యారు. బుధవారం ఉదయం మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు

ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే నగర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు

ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ కు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :