నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 01 : తంబళ్లపల్లి మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడుగా షేక్ సత్తార్ సాబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కమిటీ ఎన్నికల రచ్చబండ కార్యక్రమంలో అబ్జర్వర్ ఉమాపతిరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సత్తార్ సాబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు పదవి దక్కడంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైకాపా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీలో వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని సత్తార్ సాబ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, ఎంపీటీసీలు హరిత కరిముల్లా, మహేష్, సర్పంచ్ రెడ్డినారాయణ, అమర్నాథ్ రెడ్డి, శ్రీరాములు, చలపతి నాయుడు, శంకర, రామస్వామి, శివ ప్రసాద్, వెంకటేష్, నాగార్జున, ఫయాజ్, మహేష్, గోవర్ధన్ రెడ్డి, అన్వర్ భాష, ఖాజాపీర్, గిరి, ఎరుకల రెడ్డి, మధుకర్, మద్ది రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, శ్రీరాములు, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి, వేమారెడ్డి, రాఘవరెడ్డి, రమణ, మధు, మణి, అమీన్ పీర్ వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News