Thursday, 30 July 2026 04:33:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చరిత్రను తెలుసుకోవడం.. కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

Date : 17 May 2026 07:13 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చరిత్రను తెలుసుకోవడం.. కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలి భారతదేశ చరిత్ర అత్యున్నతమైనదని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా అనేక చారిత్రక కళాఖండాలు, పురావస్తు సంపదలు ఉన్నాయని పురావస్తు విద్యార్థి మునీంద్ర పేర్కొన్నారు. మే 18న జరగనున్న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను తెలుసుకోవడం, భావితరాలకు కాపాడి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భారతదేశ ఆవిర్భావం నుంచి ఆదిమానవుల జీవన విధానం, వివిధ తెగల సంస్కృతులు, రాజ్యాల పాలనా విధానాలు, రాజులు ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్లు, ఆచార సంప్రదాయాలు వంటి ఎన్నో చారిత్రక ఆధారాలను మ్యూజియంలు ప్రజలకు అద్దం పట్టే కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. మానవ నాగరికత పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుత తరం విద్యార్థులు చరిత్రపై అవగాహన పెంపొందించుకోవాలంటే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మ్యూజియంలను సందర్శించాలని సూచించారు. మ్యూజియంల ద్వారా విద్యార్థులు చరిత్రను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, వారసత్వ సంపద పట్ల గౌరవ భావన పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక చరిత్ర, జానపద సంస్కృతి, పురాతన కళాఖండాలు, శిల్పాలు, శాసనాలను ఆయా జిల్లాల మ్యూజియంలలో భద్రపరిస్తే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మ్యూజియంల అభివృద్ధి ద్వారా పర్యాటక రంగంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మునీంద్ర తెలిపారు. చరిత్రను పరిరక్షించడం అంటే దేశ సంస్కృతిని కాపాడుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :