నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 01 : తంబళ్లపల్లె మండలంలో గురువారం కురిసిన భారీ వర్షం గాలి వాన బీభత్సంతో మామిడి తోటలోని మామిడికాయలు ర్యాలీ తీవ్రంగా నష్టపోయి రైతులు విలవిలలాడారు. మండలంలోని రేణుమాకులపల్లి, కన్నెమడుగు, ఎద్దుల వారి పల్లె, కొట్టాల, గోపి దీన్నే, కోసువారిపల్లె, కుక్క రాజు పల్లె, కన్నె మడుగు, తంబళ్లపల్లె పంచాయతీలలో విరివిగా మామిడి సాగుతో రైతులు లబ్ధి పొందేవారు. మామిడి చెట్లకు సాగునీరు,మామిడి పూత రాలకుండా క్రిమిసంహారక మందులు పిచికారి, ఆరుగాలం కాపలా కాసి నచ్చల రూపాయలు ఖర్చు చేసి పంట చేతికి వచ్చే సమయంలో గాలివాన బీభత్సంతో మామిడి రైతులు కుదేలయ్యారు. భారీ నష్టంతో మామిడి రైతులు చేసిన అప్పులు తీరక లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతుల కు వెంటనే నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని సర్వత్ర కోరుతున్నారు
Reporter
Namitha News