నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 20 : పీఎం సూర్య ఘర్ మరియు పిఎం కోసం కార్యక్రమాల అమలులో మంచి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నా క్యాంటీన్ల నిర్వహణ, బీసీ ఎస్టీ ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు, మునిసిపల్ సేవలు, పారిశుద్ధ్యం, గంజాయి, శాంతిభద్రతలు తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ, పీఎం కుసుం, పీఎం సూర్య ఘర్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అమరావతిలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల నిర్వహణ సజావుగా జరగాలని, మునిసిపల్ సేవలు ప్రజలకు సంతృప్తికర స్థాయిలో అందించాలని, శాంతి భద్రతలపై జీరో టోలరెన్స్ ఉండాలని పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ మరియు పీఎం కుసుం పథకాలపై మాట్లాడుతూ జిల్లాలలో ఈ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆయా శాఖల అంశాలకు సంబంధించి తగు సూచనలు జారీ చేశారు
ఈ సమావేశానికి జిల్లా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు మదనపల్లి కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు
Admin
Namitha News