నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : తంబళ్లపల్లి మండలం లోని పాఠశాలలు, జనసంచారాలలో పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని స్పెషలాఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మోడల్ స్కూల్లో విద్యార్థులతో విద్యా విధానం, మధ్యాహ్నం భోజనం పై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె డంపింగ్ యార్డ్ పై స్పందిస్తూ మండల కేంద్రం నుంచి సేకరించిన తడి, పొడి చెత్త వేరుచేసి ఎరువు తయారీకి కార్యదర్శి శ్రీనివాసరావు కు తగు సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా తంబళ్లపల్లెలోని మురికినీటి కాలువల పై మూతలు వేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఈఓ త్యాగరాజు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పద్మావతి, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News