నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : తానా మాజీ అధ్యక్షులు, రాజంపేట నియోజకవర్గ ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన సతీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్. శుక్రవారం రాజంపేట పట్టణంలో వేమన సతీష్ నూతనంగా నిర్మిస్తున్న గృహం వద్ద అష్రఫ్ కలిసారు. కార్తిక మాసంలో నూతనంగా నిర్మిస్తున్న గృహం చివరి దశలో ఉంది. ఈ నూతన గృహాన్ని వేమన సతీష్ తో కలిసి అష్రఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పైన చర్చించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు సతీష్ తెలిపారు. లండన్ లో ఉంటున్న అష్రఫ్, డాక్టర్ దిల్షాద్ దంపతుల కుమార్తె అనిషాకు వేమన సతీష్ తన సెల్ ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Namitha News