నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 27 : బాలికలు బాలలతో సమానంగా విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన ఎంఈఓ నాగ సుబ్బరాయుడు తో కలిసి కస్తూరి బాలికల గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజన వసతి, సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం బాలికల విద్యా విధానంపై ఆరా తీసి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. బాలికలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తమ సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని సత్ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. బాలికల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని ఎస్ఓ తోపాటు ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట కస్తూరిబా గురుకుల అధ్యాపక బృందం, సిబ్బంది ఉన్నారు.
Reporter
Namitha News