Saturday, 18 April 2026 03:00:45 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం లో అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం పై పలు అనుమానాలు ఉన్నాయి డిజిపి ద్వారక తిరుమల రావు

Date : 22 July 2024 10:46 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి, జూలై 22: అన్నమయ్య జిల్లా, మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు లు సోమవారం ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ.... అగ్ని ప్రమాదం జరిగిన ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించామని, ఈ అగ్గి ప్రమాదం ఆర్డీవో కార్యాలయంలో 22 (ఏ) కి సంబంధించిన విభాగంలో జరిగిందని తెలిపారు. ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఆదివారం రాత్రి ఎందుకు పని చేస్తున్నారు, అగ్ని ప్రమాదం జరిగిన చోట దొరికిన అగ్గిపుల్లలు, వంటి విషయాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిందని, ఆర్డీవో కార్యాలయంలోని 22 (ఏ) వంటి పలు సబ్జెక్టులు చూసే విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా ఏఎస్పి రాజ్ కమల్, డిఆర్ఓ సత్యనారాయణరావు, మదనపల్లి ఆర్డిఓ హరిప్రసాద్, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :