Thursday, 30 July 2026 01:47:38 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రకృతి సాగు లో గుండ్లపల్లి ఆదర్శవంతం కావాలి - పోర్డు డైరెక్టర్ జె. లలితమ్మ

Date : 21 November 2025 07:34 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 21 ః నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయం సాగులో గుండ్లపల్లి పంచాయతీ లోని రైతులు రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిలవాలని ఫోర్డ్ డైరెక్టర్ జె.లలితమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు రసాయన ఎరువుల తో పండిన పంటలతో ఆరోగ్యం క్షీణించి తద్వారా పర్యావరణం కాలుష్యం పెరుగుతోందని దీని నివారణకు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. నాటి పూర్వికులు ప్రకృతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యంతో పాటు పాడి పంటలతో సుఖంగా జీవించారని నేడు వారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. రైతులు స్థానికంగా జరిగే పశువుల ఎరువు, కషాయాలు, కృత్రిమ ఎరువులతో పండించే పంటలు భావితరాలకు ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం గుండ్లపల్లి గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని వారికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చామని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించేలా సహకరించాలన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్,సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, మహిళా సంఘాలు ప్రకృతి వ్యవసాయ సాగు పై అవగాహనకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, కన్సల్టెంట్ ప్రల్లాద, ఫోర్డ్ సిబ్బంది రమణ, సంపూర్ణ, శైలజ మండలంలోని వ్యవసాయ అధికారులు , ఎంపీఎం సభ్యులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :