Monday, 08 June 2026 09:54:20 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడాలి - జిల్లా కలెక్టర్

వికసిత్ భారత్ జి-రామ్-జి పథకాన్ని వినియోగించుకొని జిల్లాలోని చిన్న తరహా నీటిపారుదల చెరువులను నింపాలి మదనపల్లి - జనవరి 05: మై స్కూల్ మై ప్రైడ్ కార్యక

Date : 05 January 2026 11:18 PM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 05: మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా 09 మరియు 10వ తరగతి విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడాలని, వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని వినియోగించుకొని జిల్లాలోని చిన్న తరహా నీటిపారుదల చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... మదనపల్లి సబ్ కలెక్టర్ రాయచోటి మరియు పీలేరు ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తాసిల్దార్లు, హౌసింగ్ తదితర శాఖల సిబ్బందితో... మై స్కూల్ మై బ్రైడ్ వికసిత్ భారత్ జి రామ్ జి పి జి ఆర్ ఎస్ ద్వారా అందే అర్జీల పరిష్కారం జిల్లాలో చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులకు భూసేకరణ రీ సర్వే స్వామిత్వ స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్... మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం పై సమీక్షిస్తూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న గెజిటెడ్ అధికారులు ఆయా పాఠశాలల్లో 9 మరియు 10 తరగతిలో చదువుతున్న విద్యార్థులకు గెజిటెడ్ అధికారులు రోల్ మోడల్ గా నిలిచి అభ్యసన ఫలితాలను పెంచాలన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే ఆసక్తిని పెంచాలని ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. జిల్లా పాలన యంత్రాంగం రూపొందించిన ఏఎన్ఎం విస్తా మొబైల్ అప్లికేషన్ లో సంబంధిత గెజిటెడ్ అధికారులు వారికి కేటాయించబడిన పాఠశాలల తనిఖీ, అభ్యసన వివరాలు తదితర అంశాలను పొందుపరచాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై సమీక్షిస్తూ... ప్రజలకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. నూతన సాంకేతికతలను వినియోగించుకొని అర్జీలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. వికసిత్భారత్ జి-రామ్-జి అంశంపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ... అన్ని మండలాల ఎంపీడీవోలు అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులైన ఎమ్మెస్ ఎం ఇ పార్కుల ఏర్పాటు రైల్వే లైన్ క్రాసింగ్ పాయింట్లు ఏర్పాటు తదితర ప్రాజెక్టులకు అవసరమయ్యే భూ సేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖ పై సమీక్షిస్తూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని హౌసింగ్ శాఖ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పై సమీక్షిస్తూ మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛతపై దృష్టి సారించి ప్రతిరోజు యాంటీ లార్వా కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలన్నారు. మునిసిపల్ నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై సమీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మరియు స్పందిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తూ ఎంపీడీవోలు మరియు నీటిపారుదల శాఖ ఏఈలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఉన్న అన్ని చిన్న తరహా నేటిపారుదల చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలన్నారు. వికసిత్భారత్ జి రామ్ జి పథకాన్ని చెరువులకు నీటిని తీసుకువెళ్లే ఫీడర్ కాలువల పూడిక తీత తదితర పనులకు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పంపిణీ చేస్తున్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలు, రీ సర్వే మరియు స్వామిత్వ అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రెవెన్యూ శాఖ మరియు సర్వే శాఖ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి, రాయచోటి మరియు పీలేరు ఆర్డిఓ శ్రీనివాస్, అన్ని మండలాల తాసిల్దారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, ఇరిగేషన్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :