Thursday, 30 July 2026 08:28:11 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడాలి - జిల్లా కలెక్టర్

వికసిత్ భారత్ జి-రామ్-జి పథకాన్ని వినియోగించుకొని జిల్లాలోని చిన్న తరహా నీటిపారుదల చెరువులను నింపాలి మదనపల్లి - జనవరి 05: మై స్కూల్ మై ప్రైడ్ కార్యక

Date : 05 January 2026 11:18 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 05: మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా 09 మరియు 10వ తరగతి విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడాలని, వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని వినియోగించుకొని జిల్లాలోని చిన్న తరహా నీటిపారుదల చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... మదనపల్లి సబ్ కలెక్టర్ రాయచోటి మరియు పీలేరు ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తాసిల్దార్లు, హౌసింగ్ తదితర శాఖల సిబ్బందితో... మై స్కూల్ మై బ్రైడ్ వికసిత్ భారత్ జి రామ్ జి పి జి ఆర్ ఎస్ ద్వారా అందే అర్జీల పరిష్కారం జిల్లాలో చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులకు భూసేకరణ రీ సర్వే స్వామిత్వ స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్... మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం పై సమీక్షిస్తూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న గెజిటెడ్ అధికారులు ఆయా పాఠశాలల్లో 9 మరియు 10 తరగతిలో చదువుతున్న విద్యార్థులకు గెజిటెడ్ అధికారులు రోల్ మోడల్ గా నిలిచి అభ్యసన ఫలితాలను పెంచాలన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే ఆసక్తిని పెంచాలని ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. జిల్లా పాలన యంత్రాంగం రూపొందించిన ఏఎన్ఎం విస్తా మొబైల్ అప్లికేషన్ లో సంబంధిత గెజిటెడ్ అధికారులు వారికి కేటాయించబడిన పాఠశాలల తనిఖీ, అభ్యసన వివరాలు తదితర అంశాలను పొందుపరచాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై సమీక్షిస్తూ... ప్రజలకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. నూతన సాంకేతికతలను వినియోగించుకొని అర్జీలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. వికసిత్భారత్ జి-రామ్-జి అంశంపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ... అన్ని మండలాల ఎంపీడీవోలు అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులైన ఎమ్మెస్ ఎం ఇ పార్కుల ఏర్పాటు రైల్వే లైన్ క్రాసింగ్ పాయింట్లు ఏర్పాటు తదితర ప్రాజెక్టులకు అవసరమయ్యే భూ సేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖ పై సమీక్షిస్తూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని హౌసింగ్ శాఖ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పై సమీక్షిస్తూ మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛతపై దృష్టి సారించి ప్రతిరోజు యాంటీ లార్వా కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలన్నారు. మునిసిపల్ నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై సమీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మరియు స్పందిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తూ ఎంపీడీవోలు మరియు నీటిపారుదల శాఖ ఏఈలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఉన్న అన్ని చిన్న తరహా నేటిపారుదల చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలన్నారు. వికసిత్భారత్ జి రామ్ జి పథకాన్ని చెరువులకు నీటిని తీసుకువెళ్లే ఫీడర్ కాలువల పూడిక తీత తదితర పనులకు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పంపిణీ చేస్తున్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలు, రీ సర్వే మరియు స్వామిత్వ అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రెవెన్యూ శాఖ మరియు సర్వే శాఖ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి, రాయచోటి మరియు పీలేరు ఆర్డిఓ శ్రీనివాస్, అన్ని మండలాల తాసిల్దారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, ఇరిగేషన్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :