నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, పుంగనూరు లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జనసేన నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం లో జరుగుతున్న SIR కార్యక్రమంలో ప్రతి పంచాయతీ లో BLO తో పాటు సామాజిక సృహతో జనసైనికులు పాల్గొని ప్రజలు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పై డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టే పని పెట్టుకున్నారు. డిప్యుటీ సిఎం.పవన్ కళ్యాణ్ ని తిడితే జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడతారేమో కానీ, కాపు కులం పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ ని తిడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గత ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా మీలో మార్పు రాలేదు, ఇదే విదంగా కొనసాగితే సమాధి చేస్తారంటూ తీవ్ర స్థాయి లో హెచ్చరించిన జనసైనికులు. ఈ కార్యక్రమం లో పుంగనూరు సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, మండల అధ్యక్షడు విరూపాక్షి, జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, మండల కార్యదర్శులు బాలాజీ నాయక్, శ్రీనివాసులు, జనసైనికులు పవన్ నాయక్,బీవీ రమణ,జావేద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News