Saturday, 12 September 2026 01:54:12 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

రెడ్డికోట ఎం.ఎస్.ఎం.ఈ. ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులకు న్యాయం చేస్తా - మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్

Date : 05 September 2026 08:51 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 05 : ప్రభుత్వం ఏ.పీ.ఐ.ఐ.సి. కింద ఎం.ఎస్.ఎం.ఈ. ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి రెడ్డి కోట వద్ద సేకరించిన భూమి విషయంలో నిరుపేద రైతుల కు న్యాయం చేస్తానని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బి ఎం ఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే రెడ్డి కోట కు చేరుకొని పార్కుకు కేటాయించిన కుక్క రాజు పల్లి దళితవాడ, రెడ్డి కోట లోని బీసీలకు చెందిన మూడు గ్రామాల నిరుపేద రైతుల భూములను ఎం ఎస్ ఎం ఈ పార్క్ నిర్మాణానికి కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ నిరుపేద రైతులు మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు తరతరాల నుండి మా పెద్దల నుండి సంక్రమించిన భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని ఆ భూమి లేకపోతే మాకు జీవనోపాధి లేక వలసలు వెళ్లాల్సి వస్తుందని ఆరోపించారు. దశాబ్దాలుగా అనుభవంలో ఉన్న మా భూముల కోసం పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మా భూములు కోల్పోతే ఎలా జీవించాలని భూముల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని మొరపెట్టుకున్నారు. రైతుల మొర ఆలకించిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెస్ ఎం ఇ పార్కులకు కేటాయించిన భూముల విషయం జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడి ప్రతి నిరుపేద రైతుకు న్యాయం చేసి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట బిఎంఆర్, రెడ్డి కోట, కుక్క రాజు పల్లి ఎస్సీ, ఎస్టి, బిసి రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :