Wednesday, 29 July 2026 11:06:11 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ లో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాసం

Date : 11 April 2026 08:42 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనెట్రిక్ గ్లోబల్, బెంగళూరు-సింగపూర్ సంస్థకు చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ లలిత్ కుమార్ యాగ్నిక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటి యుగంలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా మానవ జీవన విధానాన్ని, పరిశ్రమలను మరియు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్న శక్తిగా నిలుస్తోందని అన్నారు. ఐబీఎంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా, ఆసియాన్, భారతదేశం, అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ, భవిష్యత్తులో విజయం సాధించాలంటే విద్యార్థులు ఏఐ, డేటా మరియు క్లౌడ్ సాంకేతికతలపై పటిష్టమైన పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే భారతదేశంలో విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా పునర్నిర్మించడం, నేర్చుకునే విధానాలు, ఉద్యోగావకాశాలు మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తూ వారి కెరీర్ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్లు తారకేశ్వర రాజు బి మరియు వి. శివరామన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :