Tuesday, 14 April 2026 05:27:46 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

మిట్స్ లో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాసం

Date : 11 April 2026 08:42 PM Views : 41

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనెట్రిక్ గ్లోబల్, బెంగళూరు-సింగపూర్ సంస్థకు చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ లలిత్ కుమార్ యాగ్నిక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటి యుగంలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా మానవ జీవన విధానాన్ని, పరిశ్రమలను మరియు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్న శక్తిగా నిలుస్తోందని అన్నారు. ఐబీఎంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా, ఆసియాన్, భారతదేశం, అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ, భవిష్యత్తులో విజయం సాధించాలంటే విద్యార్థులు ఏఐ, డేటా మరియు క్లౌడ్ సాంకేతికతలపై పటిష్టమైన పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే భారతదేశంలో విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా పునర్నిర్మించడం, నేర్చుకునే విధానాలు, ఉద్యోగావకాశాలు మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తూ వారి కెరీర్ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్లు తారకేశ్వర రాజు బి మరియు వి. శివరామన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :