నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనెట్రిక్ గ్లోబల్, బెంగళూరు-సింగపూర్ సంస్థకు చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీ లలిత్ కుమార్ యాగ్నిక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటి యుగంలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా మానవ జీవన విధానాన్ని, పరిశ్రమలను మరియు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్న శక్తిగా నిలుస్తోందని అన్నారు. ఐబీఎంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా, ఆసియాన్, భారతదేశం, అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ, భవిష్యత్తులో విజయం సాధించాలంటే విద్యార్థులు ఏఐ, డేటా మరియు క్లౌడ్ సాంకేతికతలపై పటిష్టమైన పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే భారతదేశంలో విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా పునర్నిర్మించడం, నేర్చుకునే విధానాలు, ఉద్యోగావకాశాలు మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తూ వారి కెరీర్ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్లు తారకేశ్వర రాజు బి మరియు వి. శివరామన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News