నమిత న్యూస్ - Andhra Pradesh / Palnadu : ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన తండ్రీకూతుళ్లు నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు.రెంటచింతల మండలం, మల్లవరం గ్రామానికి చెందిన బాబురావు (42), సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్గా పనిచేస్తున్నాడు.తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివిన అతను, ఈ సంవత్సరం తన కూతురు చిట్టితో పాటు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.కూతురు 448 మార్కులు సాధించగా, అతను 257 మార్కులు సాధించాడు.
Reporter
Namitha News