నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత, సమాన హక్కులు మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తుచేసుకుంటూ విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వం మేనేజ్మెంట్ శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతిo రంగంలోనూ ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఆరోగ్యం, మరియు భద్రత కల్పించడం సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమం నందు ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ టి గౌస్ బాషా మరియు వందమంది మహిళా ఉపాధ్యాయురాల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించారు
Reporter
Namitha News