నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 27 : తల్లి లేని నిరుపేద పిల్లలను ఆదుకోవడానికి ఓ ఉపాధ్యాయుడు ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని కోటకొండ పంచాయతీ బి.ఎస్.ఆర్. వడ్డిపల్లికు చెందిన మస్తాన్ కు మొదటి భార్య చనిపోవడంతో మంజుల తో రెండవ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం భర్త వృద్ధుడు కావడంతో మంజుల బిడ్డలను కూలి చేసి పోషించి చదివించుకుంటోంది. ఈ గోవాలో మంజుల అనారోగ్యంతో మృతి చెందడంతో బిడ్డలు అనాధలుగా మారారు. వీరి కుమార్తె కల్పన రేణుమాకులపల్లి హైస్కూల్లో చదువుకుంటోంది. వీరి పరిస్థితి గమనించిన హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ జయ కుమార్ రెడ్డి మనసు చెలించి ఆ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అనాధ పిల్లల కు ఆర్థిక సాయం అందించిన జయ కుమార్ రెడ్డి దాతృత్వానికి సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు
Reporter
Namitha News