నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 : తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీకి చేపల చెరువు వేలం పాటల ద్వారా రూ 2.17 లక్షల ఆదాయం సమకూరినట్లు సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శివారెడ్డి విలేకరులకు తెలిపారు. గురువారం సచివాలయంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్,కార్యదర్శి నాగ పద్మజల ఆధ్వర్యంలో చేపల చెరువు వేలం పాటలు జరిగాయి. గోపి దిన్ని పెద్ద చెరువు రూ1.7 లక్షలు, నల్లచెరువు రూ 30వేలు, మద్దెమ్మ చెరువు రూ45వేలు, ఆవుల చెరువు రూ40వేలు వేలం పాటలో పాటదారులు దక్కించుకున్నారు. మొత్తం చేపల వేలం పాటల ద్వారా రూ 2.17 లక్షలు పంచాయతీకి ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లు ఈశ్వర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, టిడిపి నాయకులు అశోక్,రమణారెడ్డి, జగదీష్, చాంద్ భాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News