Saturday, 12 September 2026 12:57:15 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ప్రతి విద్యార్థి దేశభక్తి, సామాజిక స్పృహ పెంచుకోవాలి బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ ఎం.సహదేవరెడ్డి

Date : 15 August 2026 06:38 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రతి విద్యార్థి దేశభక్తి, సామాజిక స్పృహ పెంచుకోవాలి బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ ఎం.సహదేవరెడ్డి ప్రతి విద్యార్థి దేశభక్తి సామాజిక స్పృహ పెంచుకోవాలని బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ మొరంపల్లి సహదేవ రెడ్డి సూచించారు.పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నందు గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు.శనివారం పాఠశాల కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి,ప్రధానోపాధ్యాయులుమొరుంపల్లి రజినీల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.ఇందులో భాగంగా నీరుగట్టువారిపల్లి పురవీధుల్లో ఉపాధ్యాయులు,విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు.స్వాతంత్ర సమరయోధులు,జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ సహదేవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశనుండే ప్రతి ఒక్కరు దేశభక్తి,సామాజిక స్పృహను పెంపొందించుకోవాలన్నారు.అందరూ స్నేహభావంతో మెలిగి ఐకమత్యాన్ని చాటాలన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడాలని సూచించారు.భారతదేశ చరిత్ర దాని ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు.తమ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతోపాటు జాతీయ పండుగలు,సాధారణ పండగల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,తద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులు,ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :