నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు - హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,ప్రముఖులు మదనపల్లె : రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎంపి మిథున్ రెడ్డిపై అభిమానం ఉప్పొంగింది.ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని శుక్రవారం వైసీపీ నియోజకవర్గంలో యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం మెగా రక్తదాన శిబిరం,2000 వేల మందికి అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.మదనపల్లె సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలుయువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ శిబిరంలో సుమారు 100 మంది వరకు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పాలు,బ్రెడ్,పండ్లు పంపిణీ చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవవచ్చునన్నారు.హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) మాట్లాడుతూ యువతకు ఎంపీ మిథున్ రెడ్డి రోల్ మోడల్ అని,ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.అవసరమైన వారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా రక్తదానం చేసినట్లు తెలిపారు.పార్టీ కార్యకర్తల శ్రేయస్సు,ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పరితపించే ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజా రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఎస్వి రమణ,ప్రసాద్ బాబు,ఈశ్వర్ నాయక్,డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి,పవన్ తేజ రాయల్,కోళ్లబైలు అనిల్ కుమార్ రెడ్డి,అన్వేష్,హర్ష యువసేన అంబులెన్స్ మహి,కౌశిక్ రాజు,అశోక్ రాయల్,పూర్ణ,గోవా,శివ,దీపక్,హరి,గణి,చంద్ర కాలనీ రామచంద్ర,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,మాధవరెడ్డి,నాగమణి,మేరీ,వినుతా భాయి,మంజుల,ధనలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News