Saturday, 12 September 2026 01:52:32 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ఎం.ఎస్.పి. బలోపేతానికి నూతన కమిటీలు కృషి చేయాలి - ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ సంజీవ మాదిగ

Date : 04 August 2026 09:48 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 4 : రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ తో పాటు ఎంఎస్పి బలోపేతానికి నూతన కమిటీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి సంజీవ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం తంబళ్లపల్లెలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పాత కమిటీలన్నీ రద్దు పరుస్తున్నట్లు ఇదే స్థానంలో కొత్త కమిటీలను యుద్ధ ప్రాతిపదికన గ్రామస్థాయిలో ఎంపికలు చేసి పనిచేసే వారికి ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. భవిష్యత్తులో ఎం ఎస్ పి రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవడానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, స్టూడెంట్స్ యూనియన్ సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కమిటీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను ఎంపిక చేసుకోవాలని నిర్లక్ష్యం వహించరాదని సూచనలు చేశారు. ఎం ఎస్ పి బలోపేతానికి సెప్టెంబర్ నెల 9వ తేదీన వరంగల్లో జరిగే జాతీయ ఎంఆర్పిఎస్, ఎం ఎస్ పి సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలని సభలో ఎం ఎస్ పి భవిష్యత్తు విధి విధానాలను అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉపదేశిస్తారని కాన ప్రతి మాదిగ తరలి రావాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి మధు ఎం.ఎస్.పి బలోపేతంపై నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటప్ప, పిచ్చిల వాండ్లపల్లి రమణ ,తంబళ్లపల్లె నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ప్రతాప్, ఇంచార్జ్ తిరుపాల్, తంబళ్లపల్లి ఇంచార్జ్ వేటా మల్లికార్జున, మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, పెద్దమండెం నాయకురాలు రాములమ్మ, నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :