నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : తంబళ్లపల్లె మండలం లో పంచాయతీ కార్యదర్శిలు వంద శాతం ఇండ్ల పన్ను వసూళ్లే ధ్యేయంగా పనిచేయాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన తంబళ్లపల్లె మండల కేంద్రంలో పంచాయతీ ఇండ్ల పన్ను వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇండ్ల పన్ను సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని స్పెషలాఫీసర్ కోరారు. ఈ సందర్భంగా పలువురు మండల కేంద్రంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, కార్యదర్శి శ్రీనివాసులు, పద్మావతి, భాస్కర్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News