నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల గ్రీన్ అంబాసిడర్ లకు డి ఎల్ పి ఓ నాగరాజు, ఏవో థామస్ రాజాలు చెత్త వాహనాలు (మూడు చక్రాల సైకిల్స్) తోబాటు ప్లాస్టిక్ టబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ నాగరాజు మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్ లు పంచాయతీలలోని మారుమూల గ్రామాలలో పారిశుధ్యం పై దృష్టి సారించి ప్రతిరోజు ఉదయాన్నే చెత్త శుభ్రం చేసి తడి పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డ్ లో ఎరువు తయారీ చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం తో పాటు మురికినీటి కాలువలు శుభ్రం మరియు తాగునీటి కాలుష్యం లేకుండా అప్రమత్తంగా ఉండి ఐ వి ఆర్ సర్వేలో పాజిటివ్గా ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సురేంద్ర, అధికార పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News