Monday, 14 September 2026 04:46:07 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో భారీచోరీ... హుండీలు దోపిడీ, బంగారం, వెండి ఆభరణాలు చోరీ

కట్టర్లతో గేట్లు,తలుపులు ధ్వంసం చేసిన దొంగలు

Date : 24 February 2026 06:52 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో భారీచోరీ - కట్టర్లతో గేట్లు,తలుపులు ధ్వంసం చేసిన దొంగలు - రూ. 25 లక్షల నగదు,వెండి కిరీటాలు అపహరణ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో దొంగలు రెచ్చిపోయారు.ఏకంగా దేవుని గుడినే కొల్లగొట్టారు.అనపగుట్టలో కొలువున్న శ్రీకృష్ణుని ఆలయం తలుపులు,గేట్లను కట్టర్లతో ధ్వంసం చేసి రెండు హుండీలలోని నగదు,దేవుళ్ళ విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు బంగారు తాళి బొట్లు,ఇతర నగలు,నగదును దొంగలు దోపిడీ చేశారు.మంగళవారం ఉదయం శ్రీకృష్ణుని ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆలయ పూజారికి గుడిలో చోరీ జరిగిందని గుర్తించి వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు.వారు వెంటనే ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ మహమ్మద్ రఫీ ఎస్సై రహీముల్లా,శ్రీరాములు,సిబ్బంది హుటాహుటిన అనపగుట్టకు చేరుకుని కృష్ణుని ఆలయంలో చోరీ జరగడాన్ని పరిశీలించారు.విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లడంతో డాగ్ స్క్వాడ్,క్లూస్ టీంలను మదనపల్లికు పంపించారు.అనపగుట్టలోని కృష్ణుని ఆలయం వద్దకు చేరుకున్న జాగిలాలు,క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించి అణువణువు గాలించారు.దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు,అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఆలయంలో ఉన్న వాచ్‌మాన్ తన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం వెళ్లడం గమనించిన దొంగలు గ్యాస్ కట్టర్లు వినియోగించి తలుపులు కిటికీలను ధ్వంసం చేసి గుడిలో ఉన్న రెండు పెద్ద సైజు హుండీలను ధ్వంసం చేసి అందులోని నగదును పెద్ద మొత్తంలో అపహరించారు.అలాగే శ్రీకృష్ణుడి కిరీటం,సత్యభామ మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాలు,ఇతర దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు సుమారు రూ.25 లక్షలకు విలువైన నగలు నగదు అపహరించుకుపోయారు.చోరికి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా,దొంగలు శ్రీకృష్ణుని గుడిలో చోరీకి పాల్పడం బాధాకరమన్నారు.నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: