నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 13 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తు హర్ ఘర్ తిరంగా స్కూటర్ ర్యాలీని ఎంపీడీవో ఉషారాణి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం ఎంపీడీవో తో పాటు మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు ఎంపీడీవో కార్యాలయం నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో జాతీయ జెండాను చేతపూని స్వాతంత్ర పోరాట యోధులు, దేశ సమైక్యత,వందేమాతరం నినాదాలతో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉషారాణి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంటిపై ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతి కుమార్, కార్యదర్శులు మహబూబ్ బాషా, హరి ప్రసాద్, ఏ ఈ ఓ సురేష్, టిడిపి నాయకుడు మ్యూజికల్ శివ, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News