నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడుగా కుక్క రాజు పల్లి దళితవాడకు చెందిన బుడ్డ పల్లి సాంబశివ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తంబళ్లపల్లె ఎంఆర్పిఎస్ మాజీ ఇంచార్జ్, మండల అధ్యక్షుడు వేటా మల్లికార్జున, ఎద్దుల గంగాధర్ లు తెలిపారు. మంగళవారం జిల్లా ఇన్చార్జి సంజీవ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలో సాంబశివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాంబశివ తనకు మండల అధ్యక్ష పదవికి సహకరించిన నాయకులకు, మాదిగ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల సమస్యల పరిష్కారం తోపాటు ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తానని ప్రమాణం చేశారు
Reporter
Namitha News