నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు - జ్యోతి తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం - తన ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు : కె.వాణి మదనపల్లె : మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదని నేషనల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధి కే.వాణి పేర్కొన్నారు.శుక్రవారం కురబలకోట మండలం,అంగళ్లులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మదనపల్లి పట్టణానికి చెందిన జ్యోతి వద్ద గతంలో తాను రూ.లక్ష తీసుకున్న మాట వాస్తవమేనని,అయితే వడ్డీతో సహా తిరిగి ఆమె మొత్తాన్ని చెల్లించేశానన్నారు.మళ్లీ తాను రూ.8 లక్షలు చెల్లించాలని ఆమె ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ఇదిలా ఉండగా ఆమె దగ్గర కొంతమంది వడ్డీకి నగదు తీసుకున్నారని,వారు సరిగ్గా చెల్లించలేదని తన దృష్టికి తీసుకురాగా,దీంతో దివ్యాంగురాలనే మానవతా దృక్పథంతో వడ్డీలకు తీసుకున్న వారికి ఫోన్ చేసి జ్యోతికి నగదును చెల్లించాలని వారిని కోరడం జరిగిందన్నారు.వెంటనే కొంతమంది ఆమెకి ఇవ్వాల్సిన నగదు చెల్లించారన్నారు.తదనంతరం వడ్డీలు తీసుకున్న కొంతమంది మావద్ద 20 నుండి 30 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేయగా,ఇలా చేయడం తప్పు అని జ్యోతికి సూచించానన్నారు.అప్పటినుండి తనపై కక్షపెంచుకుని లేనిపోని ఆరోపణలు చేస్తోందని,గౌరవప్రదమైన హోదాలో ఉన్న తన పరువును బజారుకు ఈడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తాను జ్యోతికి ఎటువంటి అప్పులేనని స్పష్టం చేశారు.తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని,ఈ విషయంపై తాను పోలీసులు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.ఇప్పటికైనా తనపై ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.ఈ అంశంలో పోలీసులు విచారించి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న జ్యోతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News