Wednesday, 29 July 2026 08:30:50 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పాయ్ నేటి భారతీయ యువతకు ఆదర్శం.

Date : 25 December 2025 06:20 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పాయ్ నేటి భారతీయ యువతకు ఆదర్శం... ప్రశంసించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్... దివంగత నేత భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ 101వ జయంతిని పురస్కరించుకొని మదనపల్లి పట్టణం స్థానిక కదిరి రోడ్డు అన్నమయ్య సర్కిల్ నందు నూతనంగా ఆవిష్కరించిన వాజ్పాయ్ విగ్రహానికి బిజెపి శ్రేణులు పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు... ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మదనపల్లి కార్యాలయంలో అటల్ స్మృతి సమ్మేళనం పేరుతో సమావేశాన్ని నిర్వహించారు.... ఈ సమావేశంలో వాజ్పేయి వ్యక్తిత్వము వివిధ రంగాలలో ఆయన సాధించిన విజయాలు అనేక అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు, వీటిలో ముఖ్యంగా పోక్రాన్ అణు పరీక్షలు పరీక్షలు, కార్గిల్ సమయంలో వారి యొక్క దృఢ నాయకత్వం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు వాజ్పాయ్ పరిపాలన దక్షతకు ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు... వాజ్పేయి అందించిన పాలన వారసత్వానికి గౌరవించడానికి, దేశ పౌరులకు స్ఫూర్తి అందించడానికి, అనేక అద్భుత విజయాలు సాధించారని కొని యాడారు, ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి , డాక్టర్ అజమతుల్లా ఖాన్, బర్నేపల్లి రవికుమార్, నారద రెడ్డి, చంబకూరు కృష్ణమూర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్, బొజ్జప్ప , మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి , కిరణ్ కుమార్ , సునీల్ రెడ్డి , పూల నాగరాజు , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు....

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: