నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్ పాయ్ నేటి భారతీయ యువతకు ఆదర్శం... ప్రశంసించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్... దివంగత నేత భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ 101వ జయంతిని పురస్కరించుకొని మదనపల్లి పట్టణం స్థానిక కదిరి రోడ్డు అన్నమయ్య సర్కిల్ నందు నూతనంగా ఆవిష్కరించిన వాజ్పాయ్ విగ్రహానికి బిజెపి శ్రేణులు పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు... ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మదనపల్లి కార్యాలయంలో అటల్ స్మృతి సమ్మేళనం పేరుతో సమావేశాన్ని నిర్వహించారు.... ఈ సమావేశంలో వాజ్పేయి వ్యక్తిత్వము వివిధ రంగాలలో ఆయన సాధించిన విజయాలు అనేక అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు, వీటిలో ముఖ్యంగా పోక్రాన్ అణు పరీక్షలు పరీక్షలు, కార్గిల్ సమయంలో వారి యొక్క దృఢ నాయకత్వం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు వాజ్పాయ్ పరిపాలన దక్షతకు ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు... వాజ్పేయి అందించిన పాలన వారసత్వానికి గౌరవించడానికి, దేశ పౌరులకు స్ఫూర్తి అందించడానికి, అనేక అద్భుత విజయాలు సాధించారని కొని యాడారు, ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి , డాక్టర్ అజమతుల్లా ఖాన్, బర్నేపల్లి రవికుమార్, నారద రెడ్డి, చంబకూరు కృష్ణమూర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్, బొజ్జప్ప , మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి , కిరణ్ కుమార్ , సునీల్ రెడ్డి , పూల నాగరాజు , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు....
Reporter
Namitha News