Friday, 19 June 2026 03:27:01 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచి తీరాలి - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 22 April 2026 09:00 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలంలో జరిగే ఉపాధి హామీ పనులలో పనిచేసే కూలీల సంఖ్య వెంటనే పెంచాలని జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష జరిపారు. క్షేత్ర సహాయకులు ప్రతి గ్రామంలోని పర్యటించి జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి పనికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. వి బి జి రాంజీ ఉపాధి చట్టం ద్వారా 125 రోజులు పని దినాలు పెంపు, నాలుగు గంట లు పని,వారానికే వేతనాలు చెల్లింపులు వారికి సూచనలు ఇచ్చి పనికి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జలధార కార్యక్రమంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాముల నీటి సంరక్షణ పనులు చేపట్టి భవిష్యత్తులో ప్రతినీటి బొట్టు ఓడిసిపట్టే పనులు చేపట్టాలన్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1230 పనులను మంజూరు చేశానని అందులో 547 పనులు పూర్తిగా జరగి 773 పనులు ప్రోగ్రెస్ లో ఉన్నట్లు చెప్పారు. దీంతోపాటు 12 78 కొత్త పనులకు ప్రతిపాదనలు ఇచ్చినట్టు చెప్పారు. జరగబోయే పనులు నాణ్యత లోపం లేకుండా జరిగేలా చూసి పొరపాటు జరిగితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భవిష్యత్తులో భూగర్భ జలాలు అభివృద్ధికి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. మండలంలో 53 పనులకు గాను 1247 మంది కూలీలు పనిచేస్తున్నారని కూలీల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. గత నాలుగు మాసాలుగా పెండింగ్ ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల అయ్యాయని కూలీలు ఉపాధి పనులకు రావడానికి వారిలో చైతన్యం నింపి కూలీల సంఖ్య తో పాటు పనులు వేగవంతానికి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమీక్షలో ఏపీ డి చందన, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బావాజీ, సుజాత,పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవి, ఆపరేటర్లు రమేష్, సరస్వతి పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :