నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలంలో జరిగే ఉపాధి హామీ పనులలో పనిచేసే కూలీల సంఖ్య వెంటనే పెంచాలని జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష జరిపారు. క్షేత్ర సహాయకులు ప్రతి గ్రామంలోని పర్యటించి జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి పనికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. వి బి జి రాంజీ ఉపాధి చట్టం ద్వారా 125 రోజులు పని దినాలు పెంపు, నాలుగు గంట లు పని,వారానికే వేతనాలు చెల్లింపులు వారికి సూచనలు ఇచ్చి పనికి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జలధార కార్యక్రమంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాముల నీటి సంరక్షణ పనులు చేపట్టి భవిష్యత్తులో ప్రతినీటి బొట్టు ఓడిసిపట్టే పనులు చేపట్టాలన్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1230 పనులను మంజూరు చేశానని అందులో 547 పనులు పూర్తిగా జరగి 773 పనులు ప్రోగ్రెస్ లో ఉన్నట్లు చెప్పారు. దీంతోపాటు 12 78 కొత్త పనులకు ప్రతిపాదనలు ఇచ్చినట్టు చెప్పారు. జరగబోయే పనులు నాణ్యత లోపం లేకుండా జరిగేలా చూసి పొరపాటు జరిగితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భవిష్యత్తులో భూగర్భ జలాలు అభివృద్ధికి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. మండలంలో 53 పనులకు గాను 1247 మంది కూలీలు పనిచేస్తున్నారని కూలీల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. గత నాలుగు మాసాలుగా పెండింగ్ ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల అయ్యాయని కూలీలు ఉపాధి పనులకు రావడానికి వారిలో చైతన్యం నింపి కూలీల సంఖ్య తో పాటు పనులు వేగవంతానికి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమీక్షలో ఏపీ డి చందన, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బావాజీ, సుజాత,పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవి, ఆపరేటర్లు రమేష్, సరస్వతి పాల్గొన్నారు
Reporter
Namitha News