Saturday, 12 September 2026 04:47:03 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచి తీరాలి - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 22 April 2026 09:00 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలంలో జరిగే ఉపాధి హామీ పనులలో పనిచేసే కూలీల సంఖ్య వెంటనే పెంచాలని జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష జరిపారు. క్షేత్ర సహాయకులు ప్రతి గ్రామంలోని పర్యటించి జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి పనికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. వి బి జి రాంజీ ఉపాధి చట్టం ద్వారా 125 రోజులు పని దినాలు పెంపు, నాలుగు గంట లు పని,వారానికే వేతనాలు చెల్లింపులు వారికి సూచనలు ఇచ్చి పనికి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జలధార కార్యక్రమంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాముల నీటి సంరక్షణ పనులు చేపట్టి భవిష్యత్తులో ప్రతినీటి బొట్టు ఓడిసిపట్టే పనులు చేపట్టాలన్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1230 పనులను మంజూరు చేశానని అందులో 547 పనులు పూర్తిగా జరగి 773 పనులు ప్రోగ్రెస్ లో ఉన్నట్లు చెప్పారు. దీంతోపాటు 12 78 కొత్త పనులకు ప్రతిపాదనలు ఇచ్చినట్టు చెప్పారు. జరగబోయే పనులు నాణ్యత లోపం లేకుండా జరిగేలా చూసి పొరపాటు జరిగితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భవిష్యత్తులో భూగర్భ జలాలు అభివృద్ధికి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. మండలంలో 53 పనులకు గాను 1247 మంది కూలీలు పనిచేస్తున్నారని కూలీల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. గత నాలుగు మాసాలుగా పెండింగ్ ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల అయ్యాయని కూలీలు ఉపాధి పనులకు రావడానికి వారిలో చైతన్యం నింపి కూలీల సంఖ్య తో పాటు పనులు వేగవంతానికి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమీక్షలో ఏపీ డి చందన, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బావాజీ, సుజాత,పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవి, ఆపరేటర్లు రమేష్, సరస్వతి పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :