Thursday, 30 July 2026 07:37:06 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కణ

Date : 06 April 2026 01:09 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిషిత రాజు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి నిషిత రాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులను పరిరక్షించడం, అంతర్గత భద్రతను పటిష్టం చేయడం, అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం లేదా భారతీయ సంస్కృతి యొక్క చరిత్రను, జీవన విధానాలను పునరుజ్జీవింపజేయడం - ఇలా అన్ని విషయాలలోనూ బీజేపీ తన సంకల్పాలను ఆచరణలో చూపించింది. జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ బీజేపీ యొక్క మూల మంత్రం "దేశమే ప్రథమం, పార్టీ తదుపరి, వ్యక్తి చివరగా". ప్రతి బీజేపీ కార్యకర్త ఈ ప్రధాన భావనతోనే, రేయింబవళ్లు దేశ సేవకు అంకితమై పనిచేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జాతీయ ప్రయోజనాలనే మహాయజ్ఞంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, బీజేపీని ఒక మహా వటవృక్షంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దేశ సేవ, విలువలతో కూడిన రాజకీయాలు మరియు అభివృద్ధి పట్ల పార్టీకి ఉన్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, ఈ అద్భుతమైన స్థానానికి పార్టీని చేర్చింది ప్రతి కార్యకర్త యొక్క అంకితభావం, త్యాగం మరియు కఠోర శ్రమే. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ప్రశాంత్, నరేంద్ర రెడ్డి, ఆనంద్, బాలజ్యోతి, కృష్ణమూర్తి, మోహన్, పురుషోత్తం, భగవాన్, మధు, నాగరాజు, వెంకటరమణ రెడ్డి, జర్మన్ రాజు, శ్రీకాంత్, నాయక్, నారద రెడ్డి, రవి, కిరణ్, జగదీష్, వర్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :