నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 09 : ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛరథం నిర్వహణ కు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. గురువారం ఆమె పరసతోపు పంచాయతీలో స్వచ్ఛ రథం నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలు పనికిరాని ప్లాస్టిక్, బాటిల్లు, ఇనుము, వస్తువులను స్వచ్ఛరథం నిర్వాహకులకు అప్పగించి అందుకు తగినంత ఇంటి వినియోగానికి సరుకులు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిషేధం, పారిశుధ్యం తోపాటు పరిసరాలశుభ్రత, తాగునీటి కాలుష్యం, పాటించి ఆదర్శవంతంగా నిలవాలని హితవు పలికారు. ఆమె వెంట డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్, కార్యదర్శులు హరి ప్రసాద్, టిడిపి నాయకులు పురుషోత్తం, వీరాంజనేయులు, స్వచ్ఛరథ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News