నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 21 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణం లోని బసవరాజా ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో నేటి నుండీ మూడు రోజుల పాటు పుంగనూరు అర్బన్ & రూరల్ సర్కిల్ పరిధి లోని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యోగా, మెడిటేషన్ శిక్షణ శిబిరం ను నిర్వహించనున్నట్లు అర్బన్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ను ఈ రోజు నుండి మూడు రోజుల పాటు హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నిపుణులు శివశంకర్ ఆధ్వర్యంలో హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ ప్రత్యేక శిక్షణ నిర్వహించబడుతోందని తెలుపుతూ ఈ మెడిటేషన్ వలన మనలో విధి నిర్వహణలో ఒత్తిడిని నియంత్రించేందుకు దోహదపడుతోందని, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే మార్గదర్శకంగా, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు, కోపం ను నియంత్రణ చేసుకోవచ్చు, సమయానుకులంగా సమర్థవంతంగా వినియోగించుకునే పద్ధతి ని అలవర్చుకోవచ్చు, విధులను మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతొందని తెలియచేసారు. ఈ రోజు పుంగనూరు అర్బన్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, రూరల్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది హాజరయ్యారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ తరఫున మహిళా శిక్షకురాలు మానస, రాధ, శ్రీరాములు, బాల వెంకటరమణ, శ్రీధర్ , నారాయణ రెడ్డి పాల్గొన్నారు
Reporter
Namitha News