Wednesday, 29 July 2026 03:23:09 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మానసిక ఒత్తిడిని నియంత్రించడమే లక్ష్యం గా పోలీసులకు మెడిటేషన్ శిక్షణ

హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ మూడు రోజుల పాటు శిక్షణ

Date : 21 May 2026 11:01 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 21 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణం లోని బసవరాజా ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో నేటి నుండీ మూడు రోజుల పాటు పుంగనూరు అర్బన్ & రూరల్ సర్కిల్ పరిధి లోని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యోగా, మెడిటేషన్ శిక్షణ శిబిరం ను నిర్వహించనున్నట్లు అర్బన్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ను ఈ రోజు నుండి మూడు రోజుల పాటు హార్ట్ ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ నిపుణులు శివశంకర్ ఆధ్వర్యంలో హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ ప్రత్యేక శిక్షణ నిర్వహించబడుతోందని తెలుపుతూ ఈ మెడిటేషన్ వలన మనలో విధి నిర్వహణలో ఒత్తిడిని నియంత్రించేందుకు దోహదపడుతోందని, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే మార్గదర్శకంగా, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు, కోపం ను నియంత్రణ చేసుకోవచ్చు, సమయానుకులంగా సమర్థవంతంగా వినియోగించుకునే పద్ధతి ని అలవర్చుకోవచ్చు, విధులను మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతొందని తెలియచేసారు. ఈ రోజు పుంగనూరు అర్బన్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, రూరల్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది హాజరయ్యారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హార్ట్ ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ తరఫున మహిళా శిక్షకురాలు మానస, రాధ, శ్రీరాములు, బాల వెంకటరమణ, శ్రీధర్ , నారాయణ రెడ్డి పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: