నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 20 : ఎమ్మార్పీఎస్ నూతన అనుబంధ కమిటీలు బలోపేతానికి ఐకమత్యంతో పనిచేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా ఇంచార్జ్ సంజీవ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, విద్యార్థి, మహిళ, ఉద్యోగ అనుబంధ సంఘాల బలోపేతానికి నూతన కమిటీల ఎంపికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి కమిటీ ఎన్నికల్లో విద్యతోపాటు చురుగ్గా పనిచేసే యువత, మహిళలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ప్రతి కమిటీ సభ్యుడు భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు. నూతన కమిటీలు ఏర్పాటు తర్వాత వచ్చే నెల 9వ తేదీన జరిగే వరంగల్ సభ కు హాజరుకావాలని అదేవిధంగా హైదరాబాదులో జరిగే మాదిగ మహా గర్జన సభకు మాదిగలు తరలిరావాలని సూచించారు. ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ ఎన్నికలో కీలకపాత్ర పోషించాలని తంబళ్లపల్లె మండల కమిటీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటప్ప, జిల్లా నాయకులు బద్దిపల్లి రమణ,తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, కురబలకోట మండలఇంచార్జ్ కుమార్, మాజీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రమణ, మాజీ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గోపిధిని భాస్కర్, జగదీష్,మండలంలోని గ్రామ కమిటీ ఎంఆర్పిఎస్, అనుబంధ సంఘాల నూతన కమిటీ సభ్యులు, మాదిగలు పాల్గొన్నారు
Reporter
Namitha News