నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : మదనపల్లి కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం స్టెప్ అధికారులు మరియు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షతన పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులని పేర్కొన్నారు. అనేక భాషల్లో పాండిత్యం సంపాదించి ‘సరస్వతీ పుత్ర’గా గుర్తింపు పొందిన ఆయన రచనలు తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమని తెలిపారు. ముఖ్యంగా ‘శివతాండవం’ వంటి కృతులు సాహిత్యాభిమానులను ఎప్పటికీ అలరించే అద్భుత కావ్యాలని కొనియాడారు. పుట్టపర్తి నారాయణాచార్యుల జీవిత విధానం, సాహిత్య స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, అలాంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి ఆలోచనలను సమాజానికి చేరవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ సిబ్బంది, స్టెప్ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News