Wednesday, 29 July 2026 09:11:42 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి -ఏ.ఓ. నాగభూషణం

Date : 28 March 2026 10:11 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : మదనపల్లి కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్‌.ఎస్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం స్టెప్ అధికారులు మరియు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షతన పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులని పేర్కొన్నారు. అనేక భాషల్లో పాండిత్యం సంపాదించి ‘సరస్వతీ పుత్ర’గా గుర్తింపు పొందిన ఆయన రచనలు తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమని తెలిపారు. ముఖ్యంగా ‘శివతాండవం’ వంటి కృతులు సాహిత్యాభిమానులను ఎప్పటికీ అలరించే అద్భుత కావ్యాలని కొనియాడారు. పుట్టపర్తి నారాయణాచార్యుల జీవిత విధానం, సాహిత్య స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, అలాంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి ఆలోచనలను సమాజానికి చేరవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ సిబ్బంది, స్టెప్ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :