Thursday, 16 April 2026 08:26:17 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లి సర్వజన ఆస్పత్రి లో రోగుల అటెండర్లకు చలి కి ఆరు బయటే నరకం చూస్తున్నారు

Date : 11 November 2025 07:30 AM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 11 : అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి సర్వజన ఆసుపత్రి కి చికిత్సల కోసం వచ్చే రోగులకు, వారి అటెండర్లకు నరకం తప్పడం లేదు. రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందుకు పడుతుంటే మరో వైపు వారివెంట అటెండర్లు గా వచ్చిన కుటుంబీకులను రాత్రి పూట లోపలికి అనుమతించక పోవడంతో వారు ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్ల నీడన చలికి వణుకుతూ దుప్పట్లు కప్పుకుని కాలయాపన చేయాల్సిన పరిస్థితి సోమవారం రాత్రి నెలకొంది. డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల అటెండర్లు, దోమ కాట్లు, వణికించే చలితో ఆస్పత్రి బయట జాగారం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో వరండాలు, ఆస్పత్రి పైభాగంలో వెయ్యి మంది ఒకేసారి ఉండే అంత సౌకర్యాలు ఉన్నా కూడా లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నట్లు మండిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న అన్యాయాలపై జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే తమకు ఈ కష్టాలు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లోపల వరండాలు లేక గదులలో పడుకోవడానికి అనుమతించకపోతే తాము ఎక్కడ పడుకోవాలని, ఆస్పత్రి బయట చలిలో ఉంటే పొరపాటున చలికి చనిపోతే ఎవరు బాధ్యులు చెప్పాలని మండిపడ్డారు. ఏదైనా జరగరానిది జరిగితే ఆసుపత్రి సిబ్బంది సూపరిండెంట్ మరియు ఆర్ఎంవో లే బాద్యులని ఆస్పత్రి బయట రోగుల అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల కష్టాలను జిల్లా స్థాయి అధికారులూ పట్టించుకోక పోవడంతోనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల వైద్యం గాడి తప్పుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :