Thursday, 30 July 2026 02:09:36 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టిడిపి లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం - పోలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి

Date : 25 November 2025 07:54 PM Views : 371

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 25 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లె పరిశీలకుడు పోలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మల్లయ్య కొండ కింద టిడిపి మండల కమిటీ ఎన్నిక ప్రక్రియ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి క్రమశిక్షణ కు మారుపేరని గ్రూపు రాజకీయాలు తగవని కార్యకర్తల అభిప్రాయ సేకరణతో అధిష్టానం ఆదేశాల మేరకు మండల కమిటీ ఎన్నిక జరుగుతుందన్నారు. కార్యవర్గం ఎవరైనా ప్రతి కుటుంబ సభ్యుడు పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని హితవు చెప్పారు. స్పెషల్ అబ్జర్వర్ ఆర్టీసీ జోన్ చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ పార్టీలో అలకలు మాని ఐకమత్యంతో పని చేయాలని మండలంలో అన్ని విభాగాలలో మొత్తం 974 మంది పార్టీ పదవులు ఉంటాయని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ పదవులు కోసం కచ్చితంగా సభ్యత్వంతో పాటు కే ఎస్ ఎస్ సభ్యుడై ఉండి పార్టీ కోసం కష్టపడి ఉండాలన్నారు. మండల అబ్జర్వర్ టీజే వెంకటేష్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు మండల కమిటీ ఎన్నిక జరుగుతుందని గతంలో జరిగిన గ్రామ కమిటీలలో లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తెస్తే పునః పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం మండల పార్టీ కన్వీనర్ పోస్ట్ కు సుమారు 13 మంది దరఖాస్తు చేసుకోగా క్లస్టర్ ఇంచార్జీలు, మండల కమిటీ సభ్యులుగా దరఖాస్తు చేయడానికి టిడిపి సభ్యులు పోటీలు పడ్డారు. మండల కమిటీ ఎన్నికలకు వచ్చిన దరఖాస్తులు అధిష్టానం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని నాయకులు, కార్యకర్తలు గ్రూపులు వీడి పార్టీ పటిష్టతతో బాటు ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్,రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసి ధర్నాయుడు,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత నియోజకవర్గం ఉపాధ్యక్షుడు నరసింహులు, క్లస్టర్ ఇన్చార్జీలు కాలా నారాయణ,బేరి శ్రీనివాసులు, సోమశేఖర్, పురుషోత్తం, మీసాల భాస్కర్ నాయుడు, ఎర్రసానిపల్లి రామచంద్రారెడ్డి . తాటిరెడ్డి . మ్యూజికల్ శివ , కన్యమడుగు సిద్ధారెడ్డి కోటికొండ రాజేష్, రెడ్డప్ప , కోటకొండ గురుమూర్తి ,ీరాంజనేయులు,మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :