నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి - అమరావతి జేఏసి పోరాట సమితి డిమాండ్ మదనపల్లె : విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారించాలని అమరావతి జేఏసి పోరాట సమితి డిమాండ్ చేసింది ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్ల, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అమరావతి జేఏసీ ప్రకటించిన పోరాట కార్యక్రమంలో భాగంగా సోమవారము మదనపల్లి లోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ కి దశలవారీ పోరాట కార్యక్రమ వివరాలను అందజేశారు.అన్నమయ్య జిల్లా అమరావతి జేఏసీ చైర్మన్ నరసింహ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి,మదనపల్లె యూనిట్ అధ్యక్షులు బివి రమణ,జనరల్ సెక్రటరీ డాక్టర్ మునిగోపాలకృష్ణ,కేశవరెడ్డి,మురళి,లక్ష్మీనారాయణ,శంకరయ్య,జనార్ధన్,రామచంద్రయ్య,రాజన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పిఆర్సి కమిషన్,మద్యంతర భృతి,డిఎ,డి.ఆర్ బకాయిలు,అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్,పెండింగులో ఉన్న ఐదు డిఏలు,డిఆర్ లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు.విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News