Wednesday, 29 July 2026 12:35:25 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

దేవలపల్లి గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

పట్టాదారు పాస్ పుస్తకంలోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి మరియు భూ యజమాని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు

Date : 08 January 2026 03:17 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలకడ - జనవరి 08 : పట్టాదారు పాసుపుస్తకం లోని క్యూఆర్ కోడ్ ద్వారా భూ యజమాని మరియు భూమి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కలకడ మండలం దేవలపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంలో నిర్వహించబడిన పట్టాదారు పారసీ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాలో నిర్వహించబడుతున్న రెవెన్యూ గ్రామ సభలలో... రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కలిగిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలను మరియు వివాదాలను పరిష్కరించగలుగుతామన్నారు. ఈ అధునాతన సాంకేతికతతో సెంటీమీటర్ కూడా తేడా జరగకుండా రి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. అధునాతన సాంకేతికత ద్వారా రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది తదితర అంశాలను చాలా స్పష్టంగా మరియు సులభంగా గుర్తించగలుగుతామన్నారు. రెవెన్యూ గ్రామ సభలను సచివాలయ స్థాయిలో నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్.. పలువురు లబ్ధిదారులతో... పట్టాదారు పాసుపుస్తకం లో సరైన వివరాలు నమోదు చేసి ఉన్నారా లేక ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆధార్ నెంబరు సరిగా ఉందా వంటి పలు ప్రశ్నలను అడగగా సరైన వివరాలను చేర్చి ఉన్నారని లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తాసిల్దారును ఆదేశించారు. మండల తాసిల్దార్ మహేశ్వరి మాట్లాడుతూ... నూతన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారు కానీ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి పాత పుస్తకాన్ని ఇచ్చి నూతన పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకోవచ్చని సూచించారు. నూతన పట్టాదారు పాసుపుస్తకం లోని క్యూఆర్ కోడ్ను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై పాసుపుస్తకాలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు కూలంకషంగా వివరించారు. ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు మరియు ఇతర వివరాల్లో తప్పులుంటే వెంటనే అర్జి పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: