Tuesday, 14 April 2026 05:39:27 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే

Date : 13 April 2026 09:06 PM Views : 25

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలం లోని బాలిరెడ్డిగారిపల్లి(ముద్దలదొడ్డి) పంచాయితీ లోని చెరువులకు హంద్రీనీవా జలాలు పంపిణీకి హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎఈ అనిల్ కుమార్ సోమవారం ముమ్మరంగా సర్వే నిర్వహించారు. ఈ ఏడాది మార్చి23వ తేదీన బాలిరెడ్డిగారి పల్లి పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, సాగునీరు లేక చెరువులు, బోర్లు ఎండిపోతున్నాయని గ్రీవెన్స్ డే లో పంచాయితీకి చెందిన సి.ఎ ఆడిటర్ ఎం.దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎఈ అనిల్ కుమార్ బి.కొత్తకోట మండలం గోల్లపల్లి హంద్రీనీవా కెనాల్ నుండి బాల్ రెడ్డి గారి పల్లి పంచాయతీలోని ముద్దిరెడ్డి చెరువు,జన్నెచెరువు, రాచెరువు నుండి అప్పిరెడ్డి చెరువు వరకు సర్వే నిర్వహించారు. పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, చెరువులు, వ్యవసాయ బోర్లు ఇంకిపోతున్నాయని హంద్రీనీవా జలాలు పంపిణీ చేయాలని రాజంపేట పార్లమెంట్ రైతు సంఘ నాయకుడు వెంకట్ రెడ్డి ఎఈని కోరగా ఆయన సర్వే నివేదికలను ఉన్నతాధికారులు పంపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై హంద్రీనీవా ఎఈ నిర్వహించిన సర్వేతో మండలంలోని బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీలో ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :