Wednesday, 29 July 2026 12:47:25 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే

Date : 13 April 2026 09:06 PM Views : 287

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలం లోని బాలిరెడ్డిగారిపల్లి(ముద్దలదొడ్డి) పంచాయితీ లోని చెరువులకు హంద్రీనీవా జలాలు పంపిణీకి హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎఈ అనిల్ కుమార్ సోమవారం ముమ్మరంగా సర్వే నిర్వహించారు. ఈ ఏడాది మార్చి23వ తేదీన బాలిరెడ్డిగారి పల్లి పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, సాగునీరు లేక చెరువులు, బోర్లు ఎండిపోతున్నాయని గ్రీవెన్స్ డే లో పంచాయితీకి చెందిన సి.ఎ ఆడిటర్ ఎం.దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎఈ అనిల్ కుమార్ బి.కొత్తకోట మండలం గోల్లపల్లి హంద్రీనీవా కెనాల్ నుండి బాల్ రెడ్డి గారి పల్లి పంచాయతీలోని ముద్దిరెడ్డి చెరువు,జన్నెచెరువు, రాచెరువు నుండి అప్పిరెడ్డి చెరువు వరకు సర్వే నిర్వహించారు. పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, చెరువులు, వ్యవసాయ బోర్లు ఇంకిపోతున్నాయని హంద్రీనీవా జలాలు పంపిణీ చేయాలని రాజంపేట పార్లమెంట్ రైతు సంఘ నాయకుడు వెంకట్ రెడ్డి ఎఈని కోరగా ఆయన సర్వే నివేదికలను ఉన్నతాధికారులు పంపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై హంద్రీనీవా ఎఈ నిర్వహించిన సర్వేతో మండలంలోని బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీలో ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :