నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలం లోని బాలిరెడ్డిగారిపల్లి(ముద్దలదొడ్డి) పంచాయితీ లోని చెరువులకు హంద్రీనీవా జలాలు పంపిణీకి హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎఈ అనిల్ కుమార్ సోమవారం ముమ్మరంగా సర్వే నిర్వహించారు. ఈ ఏడాది మార్చి23వ తేదీన బాలిరెడ్డిగారి పల్లి పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, సాగునీరు లేక చెరువులు, బోర్లు ఎండిపోతున్నాయని గ్రీవెన్స్ డే లో పంచాయితీకి చెందిన సి.ఎ ఆడిటర్ ఎం.దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎఈ అనిల్ కుమార్ బి.కొత్తకోట మండలం గోల్లపల్లి హంద్రీనీవా కెనాల్ నుండి బాల్ రెడ్డి గారి పల్లి పంచాయతీలోని ముద్దిరెడ్డి చెరువు,జన్నెచెరువు, రాచెరువు నుండి అప్పిరెడ్డి చెరువు వరకు సర్వే నిర్వహించారు. పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, చెరువులు, వ్యవసాయ బోర్లు ఇంకిపోతున్నాయని హంద్రీనీవా జలాలు పంపిణీ చేయాలని రాజంపేట పార్లమెంట్ రైతు సంఘ నాయకుడు వెంకట్ రెడ్డి ఎఈని కోరగా ఆయన సర్వే నివేదికలను ఉన్నతాధికారులు పంపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై హంద్రీనీవా ఎఈ నిర్వహించిన సర్వేతో మండలంలోని బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీలో ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
Reporter
Namitha News