నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరేంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు సమీపంలోని గంగిరెడ్డిపల్లి శ్రీ మద్దెమ్మ ఆలయంలో మత్స్యకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులు ప్రాజెక్టులో చేప పిల్లలు వదలాలని,ప్రభుత్వం నుండి చేపల వలలు, మినీ బోట్లు, లైఫ్ జాకెట్లు, బ్యాగులు, ద్విచక్ర వాహనాలు, మార్కెటింగ్,బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యత్వం కలిగిన మత్స్యకారులు ప్రాజెక్టు చేపల వేట డిపాజిట్ సొమ్ము వెంటనే చెల్లించాలని సూచించారు. అదేవిధంగా పెద్దేరు ప్రాజెక్టు పరిధిలోని 23 కులాల మత్స్యకారులు సభ్యత్వం చేసుకోవడానికి సహకరిస్తానని చెప్పారు. పెద్దేరు ప్రాజెక్టు లో చేపల వేటతో జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సమస్యలు తన దృష్టికి తెస్తే ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని చైర్మన్ కొటాల శివకుమార్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో విలేజ్ ఫిషరీస్ అనలిస్ట్ అనితా సాయి, మత్స్యకారులు పాల్గొన్నారు
Reporter
Namitha News