నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 27 : రాయచోటి పట్టణంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి శాఖ ఆధ్వర్యంలో నిన్న రాత్రి రాయచోటి లోని వివిధ ప్రాంతాల్లో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, వీరభద్ర స్వామి ఆలయము, శ్రీ షిరిడి సాయి మందిరం పరిసరాల్లో అలాగే రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు ఈ దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం క్లబ్ కోశాధికారి లయన్ కె.మనోహర్ రాజు ఆర్థిక సహాయంతో నిర్వహించినట్టు క్లబ్ అధ్యక్షుడు లయన్ పసుపులేటి శ్యామ్ తెలిపారు. దాత లయన్ కె. మనోహర్ రాజు మాట్లాడుతూ.. రాయచోటి పట్టణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, నా వంతుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రోడ్లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ షేక్ మహమ్మద్, మాజీ అధ్యక్షులు లయన్ పి. శివారెడ్డి, కార్యదర్శి లయన్ షేక్ ఇందాద్ అహమ్మద్, లయన్ షేక్ షంషిర్ వలి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News