నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం సహకారంతో రైతులకు హంద్రీనీవా సాగునీరు, జల జీవన్ మిషన్ తోస్వచ్ఛమైన ఇంటింటికి తాగునీరు, రైతులకు రైతు భరోసా తో నేడు రైతులకు నిజమైన ఏరువాక సంభవించిందని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ప్రశంసించారు. సోమవారం తంబళ్లపల్లె రైతు సేవా కేంద్రంలో డరైతులకు వేరుసెనగ విత్తన కాయలను ఆయన పంపిణీ చేశారు. ఏ ఈ ఓ సురేష్ మాట్లాడుతూ రైతులకు కే సిక్స్ 30 కిలోల బస్తారూ 18 36 చొప్పున విత్తన కాయలు పంపిణీ చేస్తున్నామని రైతులు సకాలంలో విత్తన కాయలు తీసుకొని నూర్పిడి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామచంద్ర, బాలకృష్ణారెడ్డి, నరసింహులు, పురుషోత్తం, వీరాంజనేయులు, రామాంజులు, నరేంద్ర నాయుడు, సామి రెడ్డి, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News