నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 11 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండులో రెండు వర్గాలు షాపు విషయమై ఘర్షణ పడటం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. ఒక షాపును ఖాళీ చేయించే విషయమై గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గొడవ సమయంలో వీడియోలు ఫోటోలు తీయడానికి వచ్చిన వారిపై ఘర్షణకు వచ్చిన అల్లరి మూకలు రుబాబు చేశారు. వన్ టౌన్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించినట్లు తెలసింది. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే వాస్తవాలు తెలియనున్నాయి
Reporter
Namitha News