నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 22 ః ద్విచక్ర వాహనంలో వెళుతూ బొలోర వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో వెలుగు చూసింది. మండలంలోని రేణుమాకులపల్లి పంచాయతీ ఈదల చెరువుపల్లి కి చెందిన జల్లా నరసింహులు కుమారుడు జల్లా మణి(24) శనివారం గ్రామం నుండి గొర్రెల వద్ద కాపలా తండ్రి వద్దకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టమోటా బొలెరో వాహనం ఢీకొనడంతో మణి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని 108 వాహనంలో మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలిస్తుండగా మార్గమధ్యంలో మణి మృతి చెందాడు. మణికి రెండేళ్ల కుమార్తె భార్య గీత గర్భిణీ తో ఉండడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని పోషించాల్సిన కుమారుడు మృతితో ఆ కుటుంబం ఆశ్రయం కోల్పోయింది.విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు.
Reporter
Namitha News